ఏపీలో విద్యుత్ కోతలు లేవు: శ్రీకాంత్
ABN , First Publish Date - 2022-02-19T23:17:22+05:30 IST
ఏపీలో విద్యుత్ కోతలు లేవని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ఏపీలో విద్యుత్ కోతలు లేవని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ ప్రకారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ మీటర్లు బిగిస్తామన్నారు. వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఏపీ జెన్కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని చెప్పారు. 25 ఏళ్ల విద్యుత్ కాంట్రాక్ట్ లేకుండా ఉండేందుకు తాత్కాలిక కొనుగోళ్లు చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల లాగే బిడ్డింగ్ చేసి విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు.