yellow alert : ఢిల్లీలో భారీవర్షాలు...వెల్లువెత్తిన వరదలు
ABN , First Publish Date - 2022-09-23T13:21:06+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ(Delhi), నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాల్లో శుక్రవారం కూడా భారీవర్షాలు కురుస్తాయని...
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ(Delhi), నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాల్లో శుక్రవారం కూడా భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ(India Meteorological Department) తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్లో వెల్లడించింది.భారీవర్షాల నేపథ్యంలో శుక్రవారం ఐఎండీ నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్(yellow alert) జారీ చేసింది. భారీవర్షాల వల్ల రోడ్లను వరదనీరు ముంచెత్తడంతో రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. భారీవర్షాల వల్ల శుక్రవారం నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో పాఠశాలలకు సెలవు(schools shut) ప్రకటించారు.ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో 3,4 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ శుక్రవారం ట్వీట్(tweet) చేసింది. ఇఫ్ కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, సర్హౌల్ ప్రాంతాల్లో వరదనీరు(flood) నిలిచింది.