పెళ్లైన మూడేళ్లకే ఆత్మహత్య చేసుకున్నారు.. కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో షాకింగ్ నిర్ణయం..

ABN , First Publish Date - 2022-05-03T19:58:32+05:30 IST

వారిద్దరూ మూడేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. జీవితాంతం కలిసి ఉండాలని ఆశపడ్డారు..

పెళ్లైన మూడేళ్లకే ఆత్మహత్య చేసుకున్నారు.. కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో షాకింగ్ నిర్ణయం..

వారిద్దరూ మూడేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. జీవితాంతం కలిసి ఉండాలని ఆశపడ్డారు.. ఎప్పటికీ విడిపోకూడదని అనుకున్నారు.. అయితే విధి వారికి సవాల్ విసిరింది.. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కేన్సర్ మహామ్మారి చీకటి నింపింది.. భర్తకు కేన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని తెలిసింది.. మరణం తప్ప మరో మార్గం లేదని స్పష్టమైంది.. దీంతో కలిసి జీవించాలనుకున్న ఆ ఇద్దరూ జంటగా మరణించారు.. యూపీలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. 


నోయిడాలో సెక్టార్ 22కు చెందిన అరూప్ సింగ్ (31), శశికళ (29)దంపతులకు మూడేళ్ల కిందట వివాహమైంది. అరూప్ సింగ్ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కొన్ని రోజుల క్రితం అరూప్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. అరూప్‌కు కేన్సర్ అని, అది ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ స్టేజిలో ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ దంపతుల జీవితం అంధకారంలో మునిగిపోయింది. బయటకు ఎక్కడికీ వెళ్లకుండా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. 


రోగం నయం అయ్యే సూచనలు కనిపించకపోవడంతో కలిసి చనిపోవాలని అరూప్, శశికల నిర్ణయించుకున్నారు. ఒక సూసైడ్ నోట్ రాసి తమ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో ఇంటిపక్కన వారికి అనుమానం కలిగింది. ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి.. తలుపులు పగలగొట్టి చూడగా దంపతులిద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read more