ఉమామహేశ్వరీ తీర్థంలో సందడి

ABN , First Publish Date - 2021-03-01T06:33:06+05:30 IST

మండలకేంద్రంలో ఆరు రోజులుగా జరుగుతున్న ఉమామహేశ్వరీదేవీ తీర్థమహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం జనం పోటెత్తారు.

ఉమామహేశ్వరీ తీర్థంలో సందడి
గుర్రపు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్యాలనాయుడు


దేవరాపల్లి, ఫిబ్రవరి 28: మండలకేంద్రంలో ఆరు రోజులుగా జరుగుతున్న ఉమామహేశ్వరీదేవీ తీర్థమహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం జనం పోటెత్తారు. ఈ సందర్భంగా గుర్రం పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కిలపర్తి భాస్కరరావుకి చెందిన గుర్రానికి ప్రథమ బహుమతి రాగా, నవీన్‌ విజయదుర్గ, కుమార్‌ చిన్ను గుర్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే జగదీశ్‌ (సామర్లకోట), రాజ్యలక్ష్మి (అలమండ) గుర్రాలకు నాలుగైదు స్థానాలు సాధించాయి. విజేతలకు రూ.పది వేలు, రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు బహుమతులను మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, జీఎస్‌.నాయుడు, వేచలపు అప్పలనాయుడు, పేరునాయుడు అందజేశారు. ఈకార్యక్రమంలో అప్పారావు, రాయవరపు తాతంనాయుడు, రామ్మూర్తినాయుడు, వి.సింహాచలంనాయుడు, మొల్లి కృష్ణమూర్తి, వాలేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  


Updated Date - 2021-03-01T06:33:06+05:30 IST