నామినేషన్లు అన్నీ సక్రమమే
ABN , First Publish Date - 2021-03-08T05:20:28+05:30 IST
మండలంలోని మూడు పంచాయతీల పరిధిలో ఏడు వార్డులకు దాఖలైన నామినేషన్లు సక్రమ మేనని ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ తెలిపారు.
నందిగాం: మండలంలోని మూడు పంచాయతీల పరిధిలో ఏడు వార్డులకు దాఖలైన నామినేషన్లు సక్రమ మేనని ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం హరిదాసు పురం కేంద్రంలో నామినేషన్లను పరిశీలించారు. బోరుభద్రలో నాలుగు వార్డులకు నాలుగు, వల్లభరాయుడుపేటలో రెండు వార్డు లకు రెండు, ఆనందపురంలో ఒక వార్డుకు రెండు చొప్పున దాఖ లైన నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని ఆర్వో సింహాచలం తెలిపారు.