ఆత్మకూరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , First Publish Date - 2022-06-07T02:23:22+05:30 IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం సోమవారం ముగిసింది. మొత్తం 27 మంది అభ్యర్థులు

ఆత్మకూరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం సోమవారం ముగిసింది. మొత్తం 27 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైసీపీతో పాటు బీజేపీ, బీఎస్పీలతో సహా పలు రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి. వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్‌ రెడ్డి, బీజేపీ నుంచి జి. భరత్‌కుమార్‌లు పోటీ పడుతున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్‌ కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో అధికార వైసీపీ పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది. నియోజకవర్గ పరిధిలో ఆరు మండలాలు ఉండగా ఒక్కో మండలానికి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించారు. 

Updated Date - 2022-06-07T02:23:22+05:30 IST