ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మెమో.. ప్రెస్‌మీట్‌ను పెట్టడంపై సీరియస్

ABN , First Publish Date - 2022-04-05T17:32:09+05:30 IST

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల 21వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మెమో.. ప్రెస్‌మీట్‌ను పెట్టడంపై సీరియస్

అమరావతి : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల 21వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని వెంకటేశ్వరరావుకి నోటీస్ ఇచ్చారు. పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై ఆ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్‌లో సీఎస్ పేర్కొన్నారు. మెమో అందిన వారంలోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం నోటీస్ పంపడం గమనార్హం.

Updated Date - 2022-04-05T17:32:09+05:30 IST