ఎస్సారెస్పీ స్థలాల ఆక్రమణదారులకు నోటీసులు
ABN , First Publish Date - 2020-11-24T10:17:29+05:30 IST
నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు ఎస్సారెస్పీ డీబీఎం-38 కెనాల్ పరిధిలో స్థలాల ఆక్రమణదారులకు జేపీ మౌనిక సోమవారం నోటీసులు అందజేశారు
నల్లబెల్లి, నవంబరు 23: నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు ఎస్సారెస్పీ డీబీఎం-38 కెనాల్ పరిధిలో స్థలాల ఆక్రమణదారులకు జేపీ మౌనిక సోమవారం నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెనాల్ కుడి వైపున 90మీటర్లు, ఎడమ వైపున 110మీటర్ల స్థలం ప్రభుత్వానిదేనని అన్నారు. నల్లబెల్లిలో పలువురు కెనాల్ స్థలాన్ని ఆక్రమించి పక్కా భవనాలు నిర్మిస్తున్నారనే సమాచారం మేరకు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు. ఇదిలావుంటే ఎస్సారెస్పీ భూమిలో అక్రమంగా ఇసుక దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా నాయకుడు తడుక అశోక్గౌడ్ ఆరోపించారు.