పుట్ట శైలజకు నోటీసులు..
ABN , First Publish Date - 2021-05-09T19:01:02+05:30 IST
వామన్రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పెద్దపల్లి: వామన్రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు కమిషనరేట్లో పుట్ట శైలజను విచారిస్తున్నారు. పుట్ట మధు దంపతుల పాత్ర ఉందని ఐజీకి వామన్రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు చేశారు. కొడుకు, కోడలు హత్యపై మరిన్ని వివరాలు అందించనున్నారు. కొద్దిసేపటి క్రితం కమిషనరేట్ కార్యాలయం నుంచి కిషన్ రావుకి ఫోన్ రావడంతో ఆయన రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.