ఎన్హెచ్ 340సీ పనుల పర్యవేక్షణకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-11-28T05:39:37+05:30 IST
కర్నూలు నుంచి దోర్నాల జాతీయ రహదారి 340సీ (ఎన్హెచ్ 765)కి సంబంధించి పనులను పర్యవేక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది.
కర్నూలు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి దోర్నాల జాతీయ రహదారి 340సీ (ఎన్హెచ్ 765)కి సంబంధించి పనులను పర్యవేక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి సంబంధించిన నిధులను, పనులు కేంద్రం పరిధిలో ఉన్నా.. పనులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలంటూ నోటిఫికేషన్లో పేర్కొంది.