NRI brides: భర్తలతో భారీగా ఖర్చు చేయించి విదేశాలకు వెళ్తున్న ఎన్నారై భార్యలు.. తీరా అక్కడ సెటిల్ అయ్యాక ఏం చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-08-18T19:27:48+05:30 IST

భర్తలు ఆస్తులు అమ్మి మరీ భార్యలను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తే.. వారు అక్కడ చదివి మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాక తీరా భర్తలను వదిలేస్తున్న వైనం.

NRI brides: భర్తలతో భారీగా ఖర్చు చేయించి విదేశాలకు వెళ్తున్న ఎన్నారై భార్యలు.. తీరా అక్కడ సెటిల్ అయ్యాక ఏం చేస్తున్నారంటే..

ఎన్నారై డెస్క్: భర్తలు ఆస్తులు అమ్మి మరీ భార్యలను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తే.. వారు అక్కడ చదివి మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాక తీరా భర్తలను వదిలేస్తున్న వైనం. పంజాబ్‌లో నిత్యం ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వివాహం సమయంలోనే వరుడి కుటుంబంతో వధువు ఫ్యామిలీ ఓ ఒప్పందం చేసుకుంటుంది. తమ బిడ్డను విదేశాల్లో చదివిస్తే, ఆమె అక్కడ చదివి మంచి జాబ్‌లో స్థిరపడ్డాక భర్తను తీసుకెళ్తుందనేది ఇరు కుటుంబాల మధ్య జరిగే ఒప్పందం. ఇక వివాహం అయ్యాక ఈ ఒప్పందం ప్రకారం విదేశాల్లో భార్య చదువులకయ్యే వ్యయమంతా భర్తనే భరించాలి. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. ఇలా భర్త డబ్బులతో విదేశాల్లో చదువుకున్న భార్యలు అక్కడ మంచిగా స్థిరపడ్డాక అసలు రూపం బయటపెడుతున్నారు. స్వదేశంలో ఉన్న భర్తలను వదిలేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు కొకోల్లలు అనే చెప్పాలి. 


తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 8వేల మంది జనాభా ఉండే కొతే గోవిందపూర అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఏడాది క్రితం ఈ గ్రామానికి లవ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి తన సొంత పోలంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం ఆమె భార్య. 25 ఏళ్ల లవ్‌ప్రీత్ తనకు ఉన్న పోలంలో కొంతభాగం అమ్మి మరీ ఆమెను ఉన్నత చదువులు కోసం కెనడా పంపించాడు. దీనికోసం అతడు ఏకంగా రూ.35లక్షలు ఖర్చు చేశాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆమె ముఖం చాటేసింది. ఫోన్‌ నంబర్ మార్చేసింది. వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్ మీడియా యాప్‌లలో లవ్‌ప్రీత్ నంబర్‌ను బ్లాక్ చేసేసింది. దాంతో అత్తామామలను కలిసేందుకు వారి ఊరికి వెళ్లాడు. కానీ, వారు కూడా ఆ ఊళ్లో కనిపించకుండా పోయారు. 


దీంతో భార్య తనను మోసం చేసిందనే తీవ్ర మనోవేదనతో లవ్‌ప్రీత్ పోలానికి వెళ్లి విషం తాగేశాడు. పొద్దునే పోలంకు వెళ్లిన కుమారుడు రాత్రైన తిరిగి రాకపోవడంతో తండ్రి బల్వందీర్ సింగ్ వెళ్లి చూశాడు. అక్కడ ఆ తండ్రికి గుండె ఆగిపోయే దృశ్యం కనిపించింది. పోలంలో కుమారుడు విగతజీవిగా కనిపించాడు. కోడలు విదేశాల్లో బాగా చదివి జాబ్ సంపాదించి సెటిల్ అయితే తమ కుమారుడిని కూడా తీసుకెళ్తుందని అనుకుంటే.. చివరకు తమకు ఆ కొడుకే లేకుండా చేసిందని బల్వీందర్ వాపోయారు.   

Updated Date - 2022-08-18T19:27:48+05:30 IST