అమెరికాలో NRI హత్య.. అర్ధరాత్రి దుండగులు అతడి షాపులోకి ప్రవేశించి..

ABN , First Publish Date - 2022-06-19T03:15:21+05:30 IST

అమెరికాలోని వర్జీనియా రాష్టంలో నివసిస్తున్న ఓ NRI ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

అమెరికాలో NRI హత్య.. అర్ధరాత్రి దుండగులు అతడి షాపులోకి ప్రవేశించి..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని వర్జీనియా రాష్టంలో నివసిస్తున్న ఓ NRI ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బుధవారం అర్ధరాత్రి న్యూపోర్టు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ఓ అమెరికా జాతీయుడు కూడా మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ప్రేయాస్ పటేల్ కొన్నేళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. వర్జీనియా రాష్ట్రంలోని న్యూపోర్ట్ ప్రాంతంలో ఆయన ఓ కన్వీనియన్స్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం రాత్రి ఆయన తన షాపులోనే పని చేసే అడ్వర్డ్ థామస్‌కు ఏదో సాయం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో వారు నేలకొరిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. కాగా.. దారుణం గురించి తెలిసిన వెంటనే గుజరాత్‌లోని ప్రేయాస్ బంధులు అమెరికాకు తరలి వెళ్లారు. 

Updated Date - 2022-06-19T03:15:21+05:30 IST