ఎన్నారై నుంచి 90 మంది డిశ్చార్జి
ABN , First Publish Date - 2021-05-07T04:18:25+05:30 IST
స్థానిక ఎన్నారై జనరల్ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు పూర్తి చేసుకుని ఆరోగ్యవంతులైన మరో బృందాన్ని ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి చేశారు.
మంగళగిరి, మే 6: స్థానిక ఎన్నారై జనరల్ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు పూర్తి చేసుకుని ఆరోగ్యవంతులైన మరో బృందాన్ని ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి చేశారు. బుధవారం 45 మంది డిశ్చార్జి కాగా, గురువారం 90 మందిని డిశ్చార్జి చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారం పది రోజుల చికిత్సతో ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ మస్తాన్సాహెబ్ తెలిపారు.