Hyderabad: మానవత్వం చాటిన NRI దంపతులు
ABN , First Publish Date - 2021-11-10T16:32:53+05:30 IST
స్వదేశంలో తమ కుమార్తె సాయితన్వి మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని ఎన్ఆర్ఐ దంపతులు చల్లపల్లి హరీష్, సాయినిఖిత నిర్ణయించారు. మాదాపూర్
హైదరాబాద్/మాదాపూర్: స్వదేశంలో తమ కుమార్తె సాయితన్వి మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని ఎన్ఆర్ఐ దంపతులు చల్లపల్లి హరీష్, సాయినిఖిత నిర్ణయించారు. మాదాపూర్ కావూరిహిల్స్లోని మల్లన్న ఆలయంలో జన్మదిన వేడుకలను మంగళవా రం ఘనంగా నిర్వహించారు. నిరుపేదలకు వారు నిత్యావసర సరుకులను అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్బాలు మాట్లాడుతూ తోటివారికి సాయం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కావూరిహిల్స్ అధ్యక్షుడు ఠాగూర్తో పాటు పలువురు పాల్గొన్నారు.