టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలుగుదేశం మెల్బోర్న్ సభ్యుల భేటీ!
ABN , First Publish Date - 2022-04-28T22:59:59+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మెల్బోర్న్కు చెందిన ఎన్నారైలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మెల్బోర్న్కు చెందిన ఎన్నారైలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. కాగా.. తెలుగుదేశం మెల్బోర్న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు రావాలని కోరుతూ వారు టీడీపీ అధినేతకు ఆహ్వానపత్రిక అందజేశారు. మరోవైపు.. ఎన్నారై టీడీపీ వెబ్సైట్ ద్వారా ఎన్నారైలు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చంద్రబాబు వారిని కోరారు. ఈ భేటీలో ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్తో పాటూ తెలుగుదేశం మెల్బోర్న్ సభ్యులు పాల్గొన్నారు.