
ఎన్నారై టీడీపీ- ఖతార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. మాట్లాడుతూ పార్టీ 40వ ఆవిర్భావ ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ ఖతార్ కుటుంబసభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. ‘గత పది రోజులుగా గల్ఫ్ దేశాల పర్యటనలో నేను వెళ్ళిన ప్రతి దేశం లో ఈరోజు నాకంటూ నా సొంత కుటుంబాన్ని నేను సంపాదించుకోగలిగాను’ అని అన్నారు.

వేదిక, సభాప్రాంగణంలోని అలంకరణ చూసి ముగ్దులై అంతా పసుపుమయంగా ఉందని కొనియాడారు. మన ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణం కావాలన్నా, పోలవరం, అమరావతి పూర్తిచేయాలన్న, యువతకు ఉపాధి లభించాలన్నా ప్రతిఒక్క కార్యకర్త తనవంతు కృషిచేసి పార్టీకి పునర్వవైభవం తీసుకురావాలని, మన అధినాయకులు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధికారంలోకి రావడం అనివార్యమని చెప్పారు. భావి తరాల బంగారు భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అరాచకాలను కూడా ఎండకట్టారు. టీడీపీ ఖతార్ కార్యకర్తలు, అభిమానుల్లో ఆయన ప్రసంగం కొత్త ఉత్సహాన్ని నింపింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన నరేష్ మద్దిపాటి, రవి పొనుగుమాటి, విక్రమ్ సుఖవాసి, గొట్టిపాటి రమణయ్య, సత్యనారాయణ మల్లిరెడ్డి, రమేష్ దాసరి, ప్రతి యొక్క పసుపు సైనికుడికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసారు. గత పది రోజులుగా కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నారై టీడీపీ విభాగం కో ఆర్డినేటర్ రాజశేఖర్ చప్పిడి, కువైట్ టీడీపీ అధ్యక్షులు సుధాకర రావు కుదరవల్లికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

మీటింగ్ కి విచ్చేసిన ఖతార్ -టీడీపీ కుటుంభం సభ్యులకు నరేష్ మద్దిపాటి అభినందనలు తెలియజేసారు. టీడీపీ తెలుగువారందరి పార్టీగా అభివర్ణించారు. రవి పొనుగుమాటి తన ప్రసంగంలో 40 వసంతాల తెలుగుదేశం ప్రస్థానం గురించి చక్కగా వివరించారు. పార్టీ ఎదురుకొన్న సంక్షోభాలు, ఒడిదుడుకులు, సాధించిన అపురూప విజయాలు, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాల గురించి వివరించారు. సత్యనారాయణ మల్లిరెడ్డి ప్రసంగిస్తూ.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధికారంలోకి తీసుకురావడానికి కలసికట్టుగా పనిచేయాలి అని కోరారు. గొట్టిపాటి రమణయ్య ప్రసంగిస్తూ ప్రతికార్యకర్త ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండకట్టాలని పిలుపునిచ్చారు. శాంతయ్య యలమంచిలి ప్రసంగిస్తూ.. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యోన్ముఖులై ముందుకు సాగాలని సూచించారు. మీటింగ్ కి విచ్చేసిన మహిళామణులు, పిల్లలను జేవీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.
ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి మహిళలు మరియు పిల్లలు ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. పట్టాభిరాం గారితో ఫొటోస్ తీసుకోవటానికి కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. ఈకార్యక్రమాన్ని ముగించుకొని అయన అమెరికా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి శ్రీ విక్రమ్ సుఖవాసి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శ్రీ రవి పొనుగుమాటి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.