పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టిన పట్టభద్రులు: రాధారపు సతీష్ కుమార్

ABN , First Publish Date - 2021-03-21T16:56:55+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు.

పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టిన పట్టభద్రులు: రాధారపు సతీష్ కుమార్

బహ్రెయిన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన వాణి దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్షా అని పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు గుణపాఠం చెప్పి పని చేస్తున్న ప్రభుత్వంపై నమ్మకంతో టీర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నామని సతీష్ కుమార్ అన్నారు.

Updated Date - 2021-03-21T16:56:55+05:30 IST