ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి ప్రవాసుల సంతాపం

ABN , First Publish Date - 2021-04-29T13:49:23+05:30 IST

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతి పట్ల నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఎన్నారై టీడీపీ సీనియర్ నాయకులు మన్నవ మోహన కృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతికి ప్రవాసుల సంతాపం

ఎడిసన్, న్యూ జెర్సీ: ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతి పట్ల నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఎన్నారై టీడీపీ సీనియర్ నాయకులు మన్నవ మోహన కృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు కూడా రాధాకృష్ణ భార్య కనకదుర్గ మృతి విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారని ఓ ప్రకటనలో తెలిపారు. రాధాకృష్ణ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఆయన తెలియజేశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణకు తోడుగా కనకదుర్గ అందించిన సహకారం చాలా గొప్పదని మన్నవ మోహనకృష్ణ కొనియాడారు. కనకదుర్గ ఆత్మకు శాంతి కలగాలని మోహన కృష్ణ కోరారు.

Updated Date - 2021-04-29T13:49:23+05:30 IST