మట్టపల్లిలో నృసింహుని కల్యాణం

ABN , First Publish Date - 2022-07-01T07:12:20+05:30 IST

మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మట్టపల్లిలో నృసింహుని కల్యాణం
కల్యాణోత్సవంలో మాంగళ్యధారణ ఘట్టం

మఠంపల్లి, జూన్‌ 30 : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్ష్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో వేడుక పర్వాలను ముగించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, చెన్నూరి విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T07:12:20+05:30 IST