జనం గుండెల్లో సజీవంగా Ntr

ABN , First Publish Date - 2022-05-29T17:21:41+05:30 IST

ఎన్ని యుగాలైనా జనం గుండ్లో నందమూరి తారక రామారావు సజీవం గానే ఉంటారని ఎన్టీఆర్‌ ఆభిమాన సంఘాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను

జనం గుండెల్లో సజీవంగా Ntr

                  - ఘనంగా శత జయంతి వేడుకలు


బళ్లారి(బెంగళూరు): ఎన్ని యుగాలైనా జనం గుండ్లో నందమూరి తారక రామారావు సజీవం గానే ఉంటారని ఎన్టీఆర్‌ ఆభిమాన సంఘాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను కర్ణాటకలోని బ ళ్లారి, హొసపెటె, సింధనూరు, తదితర ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు. బళ్లారిలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఏపీఎంసీలోనూ, బళ్లారి జిల్లా అధికారి కార్యాలయం ఎదుట, విద్యానగర, వివిధ సినిమా థియేటర్లలోనూ ఎన్టీఆర్‌ అభిమానులు వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తుంగభద్ర సోషియల్‌ ఆండ్‌ కల్చరల్‌ అసోషియేషన్‌ తరపున ఏపీఎంసీ మార్కెట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేని నివాళి అర్పించి అక్కడి రైతులకు అన్నదానం చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ సంఘం అధ్వర్యంలో నటరాజ్‌ సినిమా థియేటర్‌లో జయంతి వేడుకలు జరుపుకున్నారు.

Updated Date - 2022-05-29T17:21:41+05:30 IST