వేడుకగా Ntr శత జయంతి

ABN , First Publish Date - 2022-05-29T16:20:29+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా స్థానిక హార్బర్‌ నియోజకవర్గంలో శనివారం వేడుకలు ఘనం గా నిర్వహించారు. టీడీపీ హార్బర్‌

వేడుకగా Ntr శత జయంతి

ప్యారీస్‌(చెన్నై): టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా స్థానిక హార్బర్‌ నియోజకవర్గంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ హార్బర్‌ ఇన్‌చార్జి ఎం. మోహన్‌బాబు, ఒబ్బాయి మనోహర్‌ ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు, పాదచారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ ఒక అద్భుతమైన మానవతావాది, రాజకీయాల్లో చిత్తశుద్ధితో నిస్వార్థంగా సేవచేసిన మహానుభావుడని కీర్తించారు. ప్రజా సేవలో ఎన్టీఆర్‌ తమకు స్ఫూర్తి అని, అ మహనీయుడికి భారతరత్న పురస్కారం పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.భాస్కర్‌, సూరి, శ్రీనివాసులు, ఎం. భాస్కర్‌, కె. జగన్‌, మురళి, పి.ప్రకాష్‌, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.


అనకాపుత్తూర్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

అనకాపుత్తూర్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కుమార్‌ ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. 



Updated Date - 2022-05-29T16:20:29+05:30 IST