విజయవాడ - నూజివీడు రహదారిపై నిలిచిన రాకపోకలు

ABN , First Publish Date - 2022-07-09T14:32:33+05:30 IST

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

విజయవాడ - నూజివీడు రహదారిపై నిలిచిన రాకపోకలు

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై  వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రం నుండి విజయవాడ, నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-07-09T14:32:33+05:30 IST