న‌న్ నిర్వాకం.. స్కూల్ నుంచి రూ.6కోట్లు దొంగ‌లించి ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2021-06-10T18:23:06+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ఓ రిటైర్డ్ న‌న్ నిర్వాక‌మిదీ. స్కూల్ నిధుల నుంచి ఏకంగా 8.35ల‌క్ష‌ల డాల‌ర్లు(సుమారు రూ.6కోట్లు) దొంగ‌లించింది.

న‌న్ నిర్వాకం.. స్కూల్ నుంచి రూ.6కోట్లు దొంగ‌లించి ఏం చేసిందంటే..!

టొరెన్స్, కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ఓ రిటైర్డ్ న‌న్ నిర్వాక‌మిదీ. స్కూల్ నిధుల నుంచి ఏకంగా 8.35ల‌క్ష‌ల డాల‌ర్లు(సుమారు రూ.6కోట్లు) దొంగ‌లించింది. అనంతరం వాటిని క్యాసినో ఆడ‌డం, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించ‌డంతో పాటు ఇత‌ర జ‌ల్సాల‌కు వినియోగించింది. ఇటీవ‌ల రిటైర్డ్ అయిన ఆమె.. గ‌త పదేళ్లుగా స్కూల్ నిధుల నుంచి వివిధ ద‌ఫాల‌లో ఈ భారీ మొత్తాన్ని కొట్టేసిన‌ట్లు తెలిసింది. కాలిఫోర్నియా రాష్ట్రం టొరెన్స్‌లోని సెయింట్ జేమ్స్ కాథ‌లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ప‌ని చేసిన సిస్ట‌ర్ మేరీ మార్గ‌రేట్ క్య్రూప‌ర్‌(79) ఈ నిర్వాకానికి పాల్ప‌డింది. దీంతో తాజాగా ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు. కోర్టు విచార‌ణ‌లో మార్గ‌రేట్ త‌న నేరాన్ని అంగీక‌రించింది. దాంతో ఆమెకు సుమారు 40 ఏళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. 


Updated Date - 2021-06-10T18:23:06+05:30 IST