పెళ్లి ఇష్టం లేక నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-12T15:31:02+05:30 IST

తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేయడాన్ని జీర్ణించుకోలేని నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వరగూరు

పెళ్లి ఇష్టం లేక నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

అడయార్‌(చెన్నై), జూన్‌ 11: తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేయడాన్ని జీర్ణించుకోలేని నర్సింగ్‌ విద్యార్థిని  ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వరగూరు ప్రాంతానికి చెందిన రాజా ఏకైక కుమార్తె రమ్య (21). స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ నాలుగో సంవత్సరం చదువుతోంది. మరో మూడు నెలల్లో ఈ కోర్సు ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో మేనమామతో రమ్య పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తన స్నేహితురాలికి మెసేజ్‌ పంపించి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-06-12T15:31:02+05:30 IST