ఇంటర్న్షిప్కు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ABN , First Publish Date - 2022-06-28T05:56:51+05:30 IST
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పలు సంస్థల్లో ఇంటర్న్షిప్కు ఎంపికైనట్టు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జీవీఆర్ శ్రీనివాస రావు తెలిపారు.
నూజివీడు టౌన్, జూన్ 27: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పలు సంస్థల్లో ఇంటర్న్షిప్కు ఎంపికైనట్టు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జీవీఆర్ శ్రీనివాస రావు తెలిపారు. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్కు చెందిన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎన్లాగ్ డివైజెస్ కంపెనీకి కె.గౌతమ్, బి.జ్యోత్స్న, డి.జాహ్నవి, పినాప్సిస్కు యశ్వంత్ ప్రవీణ్, షేక్ మన్షూద్, పి.ధనలక్ష్మి, పి.సాయిశివ, మైక్రాన్ కంపెనీకి ఎస్.శ్రీనివాస్ ప్రశాంత్, పి.ప్రవీణ్కుమార్ ఎంపికయ్యారన్నారు. హెచ్వోడీ పి.శ్యామ్, పీఆర్వో సురేష్బాబు పాల్గొన్నారు.