TS News: సీఎం కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు: ఎన్వీఎస్ఎస్

ABN , First Publish Date - 2022-08-07T20:28:56+05:30 IST

సీఎం కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు.

TS News: సీఎం కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు: ఎన్వీఎస్ఎస్

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్‌ (CM KCR)కు నీతి ఆయోగ్ (Niti Aayog) ప్రాధాన్యత తెలియదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మమత బెనర్జీ, అరవింద్ క్రేజీవాల్ రాజకీయంగా వ్యతిరేకించినా..  నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారని అన్నారు. నీతీష్ కుమార్ లాంటి సీఎంలు పాల్గొని దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రులు పాలసీ నిర్ణయాలు మాట్లాడారా?.. ముఖ్యమంత్రి అన్నీ మాట్లాడతారు.. సీఎస్ ఎజెండా చదువుతారు.. మంత్రులు ఎప్పుడైన మాట్లాడారా? అని ప్రశ్నించారు. కలెక్టర్లతో సమావేశాలు జరిపినప్పుడు వారి అభిప్రాయాలు తీసుకున్నారా? అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిలదీశారు. 

Updated Date - 2022-08-07T20:28:56+05:30 IST