పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , First Publish Date - 2021-10-27T06:29:50+05:30 IST
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్వైకే సౌత్ రీజనల్ డైరెక్టర్ ఎస్పీ పట్నాయక్ అన్నారు.
ఎన్వైకే రీజనల్ డైరెక్టర్ ఎస్పీ పట్నాయక్
ఏలూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్వైకే సౌత్ రీజనల్ డైరెక్టర్ ఎస్పీ పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన క్లీన్ ఇండియా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్లీన్ ఇండియా కార్య క్రమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసి ప్లాస్టిక్ సీసాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడాలన్నారు. జేసీ అంబేడ్కర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియో గాన్ని తగ్గించాలని కోరారు. పట్నాయక్ పోస్టర్ను ఆవిష్కరించి, సభికుల చేత నీటి సంరక్షణపై ప్రమాణం చేయించారు. ఎన్వైకే రాష్ట్ర సంచాలకులు ప్రసన్న, జడ్పీ సీఈఓ హరిహరనాథ్, డీపీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.