అమిత్ షాతో ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ

ABN , First Publish Date - 2022-06-21T00:24:49+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని బీజేపి జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

అమిత్ షాతో ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని బీజేపి జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశం జరిగింది.తనకు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసినందుకు లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో బీజేపీ విస్తరణ, దేశవ్యాప్తంగా ఓబీసీ మోర్చా చేపడుతున్న కార్యక్రమాలపై అమిత్ షా తో డాక్టర్ లక్ష్మణ్ చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి మోడీకి కానుకగా ఇస్తామని అన్నారు.


కేంద్ర బిజెపి నాయకత్వం రాష్ట్రం పై ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగానే హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు అమిత్ షా తెలిపారు. నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకి అధిష్ఠానం ఒప్పుకుందని ఈ సందర్భంగా లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ లోకి చేరికలు ఆ గాయన్నది అవాస్తవం అన్నారు. క్షేత్రస్థాయి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతున్నారని, పార్టీ లో కొత్తగా చేరిన వారికి తగిన ప్రాధాన్యత వుంటుందని అన్నారు. 

Updated Date - 2022-06-21T00:24:49+05:30 IST