ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ
ABN , First Publish Date - 2020-12-03T04:24:28+05:30 IST
చింతలమానేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్ బుధవారం తనిఖీ చేశారు.
చింతలమానేపల్లి, డిసెంబరు2: చింతలమానేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం తేమను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్-19 నిబంధనలు పాటించనందుకు కేంద్రం ఇన్చార్జి ప్రకాష్ను మందలించారు. ఆయన వెంట సీఎస్ఓటీ శ్యాంలాల్ ఉన్నారు.