ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్!

ABN , First Publish Date - 2021-02-28T10:12:58+05:30 IST

భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచులు వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్!

పూణే: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచులు వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మూడు మ్యాచులను పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించాలని డిసైడ్ చేశారు. మార్చి 23, 26, 28 తేదీల్లో ఈ మూడు మ్యాచులు జరగుతాయి. ప్రస్తుతం భారత్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. ఇది ముగిసిన తర్వాత 5 టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది.

Updated Date - 2021-02-28T10:12:58+05:30 IST