మాజీ పోలీసు అధికారి గంజాయి స్మగ్లింగ్...అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-26T13:10:07+05:30 IST

ఓ మాజీ పోలీసు అధికారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసిన ఘటన...

మాజీ పోలీసు అధికారి గంజాయి స్మగ్లింగ్...అరెస్ట్

మల్కాన్‌గిరి (ఒడిశా): ఓ మాజీ పోలీసు అధికారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగింది.సాక్షాత్తూ ఓ మాజీ పోలీసు అధికారి మల్కాన్‌గిరి జిల్లా నుంచి రూ.40 లక్షల విలువగల 31 బ్యాగుల్లో 800 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండగా తాము అరెస్టు చేశామని ఒడిశా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ సేథ్ చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకొని స్మగ్లింగ్ బాగోతంపై దర్యాప్తు చేస్తున్నామని అశోక్ కుమార్ వివరించారు.గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మాజీ పోలీసు అధికారి ప్రత్యక్షంగా పాల్గొనడం ఒడిశాలో సంచలనం రేపింది. 

Updated Date - 2021-02-26T13:10:07+05:30 IST