ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం.. తప్పించుకున్న ఐపీఎస్‌లు

ABN , First Publish Date - 2021-02-28T22:12:57+05:30 IST

ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం.. తప్పించుకున్న ఐపీఎస్‌లు

ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం.. తప్పించుకున్న ఐపీఎస్‌లు

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఐపీఎస్ అధికారి దంపతులు తప్పించుకున్నారు. సట్కోసియా ఎకో రిట్రీట్ క్యాంప్‌లో వారు బస చేస్తున్న తాత్కాలిక కాన్వాస్ టెంట్లకు మంటలు అంటుకున్నాయి.


ఆదివారం ఉదయం జరిగిన పెద్ద అగ్నిప్రమాదం మంటల నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు తప్పించుకున్నారు. మంటలు చెలరేగిన మూడు గుడారాలలో రవాణా కమిషనర్ సంజీబ్ పాండాతోపాటు ఐపీఎస్ అధికారి భార్య సంతోష్ బాలా ఉన్నారు. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు.

Updated Date - 2021-02-28T22:12:57+05:30 IST