అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2021-03-06T06:38:03+05:30 IST
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
పెనమలూరు, మార్చి 5 : మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జరుగనున్న ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలని తహసీల్దారు భద్రు సూచిం చారు. శుక్రవారం రామలింగేశ్వరస్వామి కొండ దిగువన కల్యాణ మండపంలో పోలీస్, రెవెన్యూ, తాడిగడప మున్సి పాలిటీ, హెల్త్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 8న జరు గనున్న సమావేశానికి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు యాక్షన్ ఫ్లాన్ను సిద్ధం చేసుకుని హాజరు కావాలని సూచించారు. సమావేశంలో సీఐ సత్యనారా యణ, ఆలయ ఈవో బి. గంగాధరరావు, తాడిగడప మున్సిపల్ కమిషనర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.