నకిలీ చలాన్ల వ్యవహారంలో అధికారులపై వేటు
ABN , First Publish Date - 2021-09-02T02:04:28+05:30 IST
జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ చలాన్ల కేసులో అధికారులపై
విజయనగరం: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ చలాన్ల కేసులో అధికారులపై వేటు వేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. నకిలీ చలాన్ల వ్యవహారంలో కారకులైన అధికారులపై శాఖాపరమైన చర్యలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిద్దమైంది. గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మతో పాటు సీనియర్ అసిస్టెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ నరసింగరావును డీఐజీ కల్యాణి సస్పెండ్ చేసారు. చలాన్ల అవకతవకల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేటు వేసినట్లు పేర్కొన్నారు.