అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-11-29T06:20:21+05:30 IST
జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో వుండి అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు.
కేవీబీపురం నవంబరు28: జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో వుండి అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు. మండలంలోని పూడి గ్రామాలకు వెళ్లే వంతెన కొట్టుకుపోగా ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం కాళంగి జలాశయాన్ని పరిశీలించి ప్రాజెక్టు ఇన్ప్లో, అవుట్ ప్లో తదితర విషయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్, ఇన్చార్జి ఎంపీడీవో ఆనంద్బాబు, డీఈ గురివిరెడ్డి, ఏఈ వనిత, సురేష్, ఏఎ్సఐ లోకనాఽథం, నాయకులు కృష్ణయ్య, ఎంపీపీ మునిలక్ష్మి, జడ్పీటీసీ మున్నెమ్మ, నందకుమార్, లాల్బాబు, రామకృష్ణారెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.