‘భాస్కరరావు హత్యలో కొల్లు రవీంద్రకు సంబంధంలేదని అధికారులే అంటున్నారు’

ABN , First Publish Date - 2020-07-06T22:18:27+05:30 IST

మోకా భాస్కరరావు హత్యకేసు వివరాలు ఎందుకు చెప్పడంలేదని టీడీపీ నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. హత్య కేసుతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు

‘భాస్కరరావు హత్యలో కొల్లు రవీంద్రకు సంబంధంలేదని అధికారులే అంటున్నారు’

విజయవాడ: మోకా భాస్కరరావు హత్యకేసు వివరాలు ఎందుకు చెప్పడంలేదని టీడీపీ నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. హత్య కేసుతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు సంబంధంలేదని అధికారులే అంటున్నారని తెలిపారు. బీసీ నేతగా ఎదుగుతున్నారనే కొల్లు రవీంద్రపై కుట్ర చేశారని మండిపడ్డారు. రవీంద్ర విశాఖపట్నానికి ప్రయాణమయ్యారని, గోడదూకి వెళ్లిన మాట అసత్యమని, పారిపోయేంత పిరికిపంద కాదని పేర్కొన్నారు. కావాలంటే ఇంటి ముందు సీసీ కెమెరాలు పరిశీలించుకోవాలన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నోటీసులు ఇవ్వకుండా కొల్లు రవీంద్రను ఏ4గా నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చిన సంగతి గోప్యంగా ఉంచారని ఉమా ఆరోపించారు.  

Updated Date - 2020-07-06T22:18:27+05:30 IST