పామాయిల్ చెట్లు దగ్ధం
ABN , First Publish Date - 2022-05-23T06:02:41+05:30 IST
పెద్దపాటివారిగూడెంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. లక్షా 50 వేల విలువైన పంట నష్టం వాటిల్లింది.
ముసునూరు, మే 22: పెద్దపాటివారిగూడెంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. లక్షా 50 వేల విలువైన పంట నష్టం వాటిల్లింది. స్థానిక రైతు మేరుగు రాంబాబుకు చెం దిన పామాయిల్ తోట వద్ద సరిహద్దు రైతు ముళ్ళ కంచెకు నిప్పు పెట్టడంతో రాంబాబు పామాయిల్ తోటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 25 పామాయిల్ చెట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల రైతులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని వీఆర్వో శ్రీనివాసరావు, ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బంది పరిశీలించారు. ఈ సంఘటనలో సూమారు లక్షా 50 వేలు పంట నష్టం వాటిల్లినట్లు వీఆర్వో అంచనా వేశారు.