ఒకేషనల్ పరీక్షల నిర్వహణపై ఆర్ఐవో ఆగ్రహం
ABN , First Publish Date - 2021-04-17T06:09:47+05:30 IST
మద్దిపాడు నాగార్జున హైస్కూలులో శుక్రవారం ఒంగోలు శ్రీరాఘవ ఒ కేషనల్ కళాశాల విద్యా ర్థులకు జరిగిన డెయిరీ సైన్సు ప్రయోగ పరీక్షల ను ఆర్ఐవో వీవీ.సుబ్బా రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా నిర్వ హించాల్సి ఉండగా తమకిష్టం వచ్చినట్లు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిం చారు.
మద్దిపాడు, ఏప్రిల్ 16 : మద్దిపాడు నాగార్జున హైస్కూలులో శుక్రవారం ఒంగోలు శ్రీరాఘవ ఒ కేషనల్ కళాశాల విద్యా ర్థులకు జరిగిన డెయిరీ సైన్సు ప్రయోగ పరీక్షల ను ఆర్ఐవో వీవీ.సుబ్బా రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా నిర్వ హించాల్సి ఉండగా తమకిష్టం వచ్చినట్లు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిం చారు. ఇన్విజిలేటర్ల సంతకం లేకుండా ఎలా పరీక్షలను రాయిస్తాయని యా జమాన్యంపై మండిపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ పేపర్ బండిల్స్తో సహా తన కార్యాలయంలో కలవాలని ఆదేశించారు. విద్యార్థులు భౌతికదూరం పా టించాల్సి ఉండగా, అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.