Hyderabad: పాతబస్తీలో మ్యాన్ ఈటర్ సర్పాలు
ABN , First Publish Date - 2022-10-07T19:59:56+05:30 IST
హైదరాబాద్ (Hyderabad): పాతబస్తీలో మ్యాన్ ఈటర్ సర్పాలు కలకలం సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ (Hyderabad): పాతబస్తీలో మ్యాన్ ఈటర్ సర్పాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక సమాధి నుంచి మరో సమాధిలోకి వెళ్తున్నాయి. పాటి పెట్టిన మృత దేహాలను సయితం తింటున్నాయి. జనావాసాల మధ్య శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. చేసిన తప్పుల వల్లే అల్లా శిక్షలు వేస్తున్నాడంటూ ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. పగలు కూడా శ్మశానవాటిక వైపు వెళ్లడానికి జనాలు భయపడుతున్నారు.
మరోవైపు పాతబస్తీలోని పలు శ్మశానవాటికల దగ్గర క్షుద్రపూజలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. క్షుద్రపూజలు చేస్తున్నారన్నవార్త బయటకు రావడంతో మంత్రగాళ్లు సయితం బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోందన్న మిస్టరీ మాత్రం వీడటంలేదు.