భార్య భౌతికకాయం వద్ద... కుప్పకూలిపోయాడు

ABN , First Publish Date - 2021-07-26T05:30:00+05:30 IST

భార్య మృతదేహం వద్ద రోదిస్తూ కుప్పకూలి భర్త కూడా తనువు చాలించాడు.

భార్య భౌతికకాయం వద్ద... కుప్పకూలిపోయాడు
సాంబమూర్తి, నాగయమ్మ (ఫైల్‌)

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి 



ఆరిలోవ, జూలై 26: భార్య మృతదేహం వద్ద రోదిస్తూ కుప్పకూలి భర్త కూడా తనువు చాలించాడు. నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దుర్గాబజార్‌లో చింతలపూడి సాంబమూర్తి (71), భార్య నాగయమ్మ (65), ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. నాగయమ్మ అనారోగ్యం పాలవ్వడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో చేర్పించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం రాత్రి మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తెచ్చారు. భార్య మృతదేహం వద్ద రోదిస్తూ సాంబమూర్తి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.వెంటనే కుమారులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా వుండేవారని స్థానికులు తెలిపారు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - 2021-07-26T05:30:00+05:30 IST