రూ. 4.5 కోట్ల విలువైన పాత నోట్ల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-16T22:33:34+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ స్పెషల్

రూ. 4.5 కోట్ల విలువైన పాత నోట్ల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్  ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) నిర్వహించిన దాడుల్లో రూ. 4.50 కోట్ల విలువైన పాత నోట్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు హరిద్వార్‌లో పట్టుబడగా, మిగతా ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని ఎస్‌టీఎఫ్ సీనియర్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ తెలిపారు.


స్వాధీనం చేసుకున్న పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేయనున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, అదే రోజు విద్వేష ప్రసంగాల కేసులో యతి నర్సింగానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వచ్చే నెలలో ఉత్తరాఖండ్, యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Updated Date - 2022-01-16T22:33:34+05:30 IST