ఓల్డ్ మలక్‌పేట్‌లో మొదలైన రీపోలింగ్

ABN , First Publish Date - 2020-12-03T12:59:48+05:30 IST

ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో గురువారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది.

ఓల్డ్ మలక్‌పేట్‌లో మొదలైన రీపోలింగ్

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో గురువారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఓటర్లు 54,655 మంది కాగా..అందులో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రీపోలింగ్ కోసం అధికారులు 69 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 12 మంది మైక్రో అబ్జర్వర్‌‌లను నియమించారు. దాదాపు 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. గుర్తుల తారుమారుతో ఓల్డ్‌ మలక్‌పేటలో రీ పోలింగ్‌‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-03T12:59:48+05:30 IST