నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-03-10T02:26:48+05:30 IST
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వాల్మీకిపురం మండలం విఠలం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(75) ఒంటరిగా నివాసం ఉంటోంది. సమీపంలోని ఇంట్లో ఆమె కుమారుడు రమణారెడ్డి ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి వెంకటలక్ష్మమ్మను ఎవరో గొంతుకోసి హత్యచేశారు. ఆమె శరీరంపై ఉన్న సుమారు రూ.5లక్షల విలువచేసే బంగారు హారం, 4గాజులు, జత కమ్మలు, ఓ ఉంగరం అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.