నాకు ఏ ఆధారం లేదు..పెన్షన్ కట్ చేసారు: ఓ అవ్వ

ABN , First Publish Date - 2021-09-03T21:08:53+05:30 IST

తనకు ఏ ఆధారం లేదని, పిల్లలు కూడా లేరని, వస్తున్న పెన్షన్ కూడా కట్ చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

నాకు ఏ ఆధారం లేదు..పెన్షన్ కట్ చేసారు: ఓ అవ్వ

ప.గో.జిల్లా: తనకు ఏ ఆధారం లేదని, పిల్లలు కూడా లేరని, వస్తున్న పెన్షన్ కూడా కట్ చేశారని ఓ వృద్ధురాలు సరస్వతి (80) ఆవేదన వ్యక్తం చేసింది. అద్దెంట్లో ఉంటున్నానని, తనకొక తల్లి ఉందని ఆమెకు వందేళ్లని.. ఆమె ఉన్నా చనిపోయినదానితో సమానమని, ఆమెను కూడా తానే చూసుకుంటున్నారని ఆ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. 


పశ్చిమగోదావరి జిల్లా తినమండ మండలం, వరగ్రామంలో నివసిస్తున్న సరస్వతి అనే ఆమెకు 80 ఏళ్లు, ఆమె తల్లికి వందేళ్లు. అయితే ఇద్దరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉండడంవల్ల పెన్షన్ ఆపేశారు. దీంతో వారి జీవనం కష్టమైంది. వారి స్థితిపై స్థానిక నాయకులు, అధికారులు స్పందించి ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి పరిస్థితిపై గ్రామానికి చెందిన ఒకరు వీడియో ద్వారా నాయకులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-09-03T21:08:53+05:30 IST