చెరువులో పడి వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2020-11-27T05:24:22+05:30 IST
మండలంలోని నాళేశ్వర్కు చెందిన మగ్గిడి బాజమ్మ (62) అనే వృద్ధురాలు చెరువులో పడి మృతిచెందిందని ఎస్ఐ యాకూబ్ తెలిపారు.
నవీపేట, నవంబరు 26: మండలంలోని నాళేశ్వర్కు చెందిన మగ్గిడి బాజమ్మ (62) అనే వృద్ధురాలు చెరువులో పడి మృతిచెందిందని ఎస్ఐ యాకూబ్ తెలిపారు. బాజమ్మకు గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని, పది రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లిందని, గురువారం స్థానిక పటేల్ చెరువులో ఆమె మృతదేహం కనిపించిందని ఆయన పేర్కొన్నారు. మృతదేహం కుళ్లిపోయిందని, భర్త పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.