‘ఓమ్’ సరికొత్త రికార్డు: కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర!

ABN , First Publish Date - 2020-11-24T17:06:27+05:30 IST

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓమ్ మహాజన్.. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకూ ...

‘ఓమ్’ సరికొత్త రికార్డు: కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర!

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓమ్ మహాజన్.. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకూ 5,600 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా ఓమ్ మహాజన్ మాట్లాడుతూ ‘మా చిన్నాన్న రిటైర్డ్ కర్నల్ పన్నూ సాహబ్ నెలకొల్పిన రికార్డును అధిగమించాను. ఈ దూరాన్ని 8 రోజుల 7 గంటట్లో పూర్తి చేసి, కొత్త రికార్డు నెలకొల్పానని’ తెలిపారు. ఓమ్ మహాజన్(17) ఆరు నెలల క్రితం ఆర్ఎఎఎం కోసం క్వాలిఫయర్ ట్రైనింగ్ ప్రారంభించారు. అది నవంబరుకు పూర్తి కావలసి వుంది. అయితే ఇంతలోనే సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకుని దానిని అమలు చేశాడు. ఈ సైకిల్ యాత్రలో శ్రీనగర్‌లో అత్యంత చలిని, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలను, దక్షిణాదిలో ఎండలను తట్టుకుంటూ సైకిల్ యాత్ర పూర్తి చేశారు. 

Updated Date - 2020-11-24T17:06:27+05:30 IST