ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదు

ABN , First Publish Date - 2021-12-05T16:32:28+05:30 IST

రాష్ట్రంలో ఇంకా ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం సూచించిన

ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదు

                - ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో ఇంకా ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం సూచించిన విధంగా రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇంకా ఒమైక్రాస్‌ వైరస్‌ నిర్ధారణ కాలేదని తెలిపారు. కరోనా నిర్ధారణకు, ఒమైక్రాన్‌ నిర్ధారణకు తేడా ఉందని తెలిపారు. కానీ కరోనా - ఒమైక్రాన్‌ చికిత్సల్లో ఎలాంటి తేడా లేదన్నారు. ఈ రెండు ఒకే విధమైన లక్షణాలు కలిగి వుంటాయన్నారు. ఒమైక్రాన్‌ వైరస్‌ వేగంగా ప్రబలుతుందనే విషయం వాస్తవమని, కానీ ప్రస్తుతం ఆ వైరస్‌ లక్షణాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. మొట్టమొదటిసారిగా కరోనా వచ్చిన సమయంలో కూడా తీవ్రత తక్కువగా ఉందని, ఒక దశ దాటిన తర్వాత వైరస్‌ వ్యాప్తి అధికమైందన్నారు. కరోనా వచ్చిన కొత్తలో టీకా కానీ చికిత్స అవసరమైన మందులు కానీ లేని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం టీకా, ఆక్సిజన్‌, క్వారంటైన్‌ కేంద్రాలు అని పలు సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.  

Updated Date - 2021-12-05T16:32:28+05:30 IST