ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి విజృంభణ‌.. ఒక్క‌రోజే !

ABN , First Publish Date - 2020-07-14T16:31:55+05:30 IST

గ‌ల్ఫ్ దేశ‌మైన‌ ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభిస్తోంది. అంత‌కంత‌కు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి విజృంభణ‌.. ఒక్క‌రోజే !

మ‌స్క‌ట్‌: గ‌ల్ఫ్ దేశ‌మైన‌ ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభిస్తోంది. అంత‌కంత‌కు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమ‌వారం ఒక్క‌రోజే ఒమ‌న్‌లో 2,164 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వీటిలో 1,572 మంది ఒమ‌న్ పౌరులుంటే.. మిగ‌తా 592 మంది విదేశీయులు ఉన్నారు. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డ్డ వారి సంఖ్య 58,179కు చేరింది. అయితే, నిన్న ఒకేరోజు 1,159 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న వారు 37,257 మంది అయ్యారు. కాగా, సోమ‌వారం ఇద్ద‌రు క‌రోనాతో మృతి చెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశం‌లో క‌రోనా కాటుకు బ‌లైన వారు 259 మంది అయ్యారు. ఇదిలా ఉంటే... వ‌ర‌ల్డ్‌వైడ్‌గా స్వైర విహారం చేస్తున్న ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 5.75 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. అలాగే కోటి 32 ల‌క్ష‌ల మంది బాధితులు ఉన్నారు.  

Updated Date - 2020-07-14T16:31:55+05:30 IST