Abroad నుంచి వచ్చే వారు పరీక్షలు చేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-12-01T17:51:03+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమెక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉంటూ విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి
హైదరాబాద్/ముషీరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమెక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉంటూ విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి సూచించారు. మంగళవారం ముషీరాబాద్, భోలక్పూర్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డా.వెంకటి సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వెద్యులతో ఆయన మాట్లాడారు. ఆర్టీపీసీఆర్ టెస్టులను మరింత పెంచాలనీ.. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఒమిక్రాన్ వైరస్ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.