ఏపీలో తొలి ఒమైక్రాన్ కేసు

ABN , First Publish Date - 2021-12-12T17:18:58+05:30 IST

రాష్ట్రంలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది.

ఏపీలో తొలి ఒమైక్రాన్ కేసు

అమరావతి: రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. గత నెల 27న ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ముంబైలో ఆర్టీపీసీఆర్ టెస్టులో కొవిడ్ నెగిటివ్‌గా తేలింది. విజయనగరంలో మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని వైద్యారోగ్య శాఖ వెల్లడింది. 10 కేసుల్లో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందనక్కర్లేదని వైద్యారోగ్యశాఖ భరోసా ఇచ్చింది. 

Updated Date - 2021-12-12T17:18:58+05:30 IST